మావోయిస్టుల ఆంధ్రా-ఒడిసా స్పెషల్‌ జోన్‌ కమిటీ

by సూర్య | Thu, Nov 24, 2022, 11:18 AM

ఒడిసాలో దొరికిన మావోయిస్టు డంప్‌లో ఈవీఎం ఉండడంతో పోలీసులు అవాక్కయ్యారు. ఈవీఎం మావోయిస్టులకు ఎందుకు? దీన్ని ఎక్కడ నుంచి తెచ్చారు? అని ఒడిసా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఒడిసా రాష్ట్రం మల్కనగిరి జిల్లా కటాఫ్‌ ఏరియా ఏవోబీలోని జోడాంబ పోలీ్‌సస్టేషన్‌ పరిధిలోకి వచ్చే ధ్కాడ్‌పొదర్‌ అటవీ ప్రాంతంలో మావోయిస్టులకు చెందిన భారీ డంప్‌ దొరికినట్టు మల్కనగిరి పోలీసులు బుధవారం వెల్లడించారు. మావోయిస్టుల ఆంధ్రా-ఒడిసా స్పెషల్‌ జోన్‌ కమిటీకి చెందిన ఈ డంప్‌ సోమవారం సాయంత్రం లభ్యమైనట్టు వారు వెల్లడించారు. ఈ డంప్‌లో ఎన్నికల్లో వినియోగించిన అభ్యర్థుల పేర్లు, గుర్తులతో ఉన్న ఈవీఎం కూడా ఉంది. తుపాకీ, టెలిస్కోప్‌, మందుపాతర్లు, పిస్తోలు, పైప్‌ క్లెమోర్‌ ఐఈడీ మేకింగ్‌, గ్రనేడ్లు తదితర వస్తువులు ఉన్నాయి.

Latest News

 
పిఠాపురం బరిలో ముగ్గురు పవన్ కళ్యాణ్‌లు ఉన్నారన్నది అబద్ధం Thu, Apr 25, 2024, 08:12 PM
పింఛన్ల పంపిణీకి దగ్గర పడుతున్న సమయం.. ఈసీకి చంద్రబాబు లేఖ Thu, Apr 25, 2024, 08:08 PM
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణ Thu, Apr 25, 2024, 08:02 PM
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త Thu, Apr 25, 2024, 07:57 PM
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM