జాతీయ స్థాయి కాలిగ్రఫీ పోటీలకు కలెక్టర్‌ దిల్లీరావు తనయుడు

by సూర్య | Thu, Nov 24, 2022, 11:11 AM

జాతీయ స్థాయి కాలిగ్రఫీ పోటీలకు ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ దిల్లీరావు తనయుడు జివితేష్‌ ఎంపికయ్యాడు. వచ్చే ఏడాది జనవరి 22న జాతీయ చేతివ్రాత దినోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న నేషనల్‌ కాలిగ్రఫీ ఒలింపియాడ్‌కు ఆంధ్రప్రదేశ్‌ నుంచి జివితేష్‌ ఎంపిక కావటం విశేషం. ఇంతకు ముందే రాష్ట్రస్థాయిలో నిర్వహించిన చేతివ్రాత పోటీలలో జివితేష్‌ మొదటి స్థానాన్ని సాధించాడు. విజయవాడ నలందా విద్యానికేతన్‌లో ఎనిమిదో తరగతి చదువుతున్న జివితేష్‌ జాతీయ పోటీలకు ఎంపికైన విషయాన్ని హ్యాండ్‌రైటింగ్‌ ట్రైనర్స్‌ అసోసియేషన్‌ కార్యదర్శి షేక్‌ మెహబూబ్‌ హుస్సేన్‌ బుధవారం మీడియాకు తెలిపారు. రాష్ట్ర స్థాయిలో ఇటీవల నిర్వహించిన ఒలింపియాడ్‌లో 14 వేలమంది విద్యార్థులు హాజరుకాగా జివితేష్‌ ప్రథమ స్థానాన్ని సాధించటం గమనార్హం. వచ్చే ఏడాది జరిగే నేషనల్‌ కాలగ్రఫీ ఒలంపియాడ్‌ లో 3 లక్షల మంది విద్యార్థులు పోటీలలో పాలు పంచుకోనున్నారు.

Latest News

 
వైసీపీకి డొక్కా మాణిక్య వరప్రసాద్ రాజీనామా.. అడుగులు అటేనా Fri, Apr 26, 2024, 07:47 PM
పిఠాపురం ఎన్నికల బరిలో చెప్పులు కుట్టే వ్యక్తి.. చదువు, ఆస్తులెంతో తెలుసా Fri, Apr 26, 2024, 07:43 PM
ఏపీలో ఆ పార్టీకి షాక్.. అభ్యర్థి నామినేషన్ తిరస్కరణ Fri, Apr 26, 2024, 07:39 PM
కాకినాడ ఎన్నికల బరిలో కిలాడి టీ టైమ్ శ్రీనివాస్ Fri, Apr 26, 2024, 07:34 PM
వాళ్ల బాస్‌కు శిక్షపడేలా చేశానని కక్ష.. నన్ను చంపే కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ Fri, Apr 26, 2024, 07:28 PM