ఆ రాళ్లు త్వరలోనే తాడేపల్లి ప్యాలెస్‌ను తాకుతాయి: నారా లోకేశ్

by సూర్య | Wed, Nov 23, 2022, 11:54 PM

అస్మిత్‌రెడ్డిపై జరిగిన దాడిని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఖండించారు. టీడీపీకి పెరుగుతున్న ప్రజాదరణను చూసి ఓర్వలేక వైసీపీ ముష్కర మూకలు ఇలాంటి దాడులకు పాల్పడుతున్నాయన్నారు. ఇటీవల చంద్రబాబు కాన్వాయ్‌పై రాళ్లదాడికి తెగబడ్డారని, ఇప్పుడు అస్మిత్‌రెడ్డిపై దాడికి తెగబడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ అధికార ఉన్మాద ఫ్యాక్షన్ రాజకీయాలు ప్రజాస్వామ్యానికే ముప్పుగా పరిణమించాయన్నారు. వీధి లైట్లు ఆపేసి చీకట్లో దాడి చేసి పిరికిపందల్లా పోలీసుల వెనక దాక్కున్నారని అన్నారు. దమ్ముంటే ఎదురుగా వచ్చి ఎదుర్కోవాలని సవాలు చేశారు. తాడిపత్రిలో విసిరిన రాళ్లు త్వరలోనే తాడేపల్లి ప్యాలెస్‌ను తాకుతాయని లోకేశ్ హెచ్చరించారు.

Latest News

 
ముద్దనూరు రైల్వే స్టేషన్ మార్గం.. అధ్వాన పరిస్థితులు, ప్రజల ఆందోళన Wed, Jun 18, 2025, 02:13 PM
పామిడి మండలంలో కొత్త తహసీల్దార్‌గా శిరీష బాధ్యతల స్వీకరణ Wed, Jun 18, 2025, 02:10 PM
బుక్కపట్నం ప్రభుత్వ డిగ్రీ కళాశాల నిర్మాణం.. ఏడేళ్లుగా అసంపూర్తి Wed, Jun 18, 2025, 02:07 PM
విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం విద్యామిత్ర కిట్లు Wed, Jun 18, 2025, 02:04 PM
మడకశిర టీడీపీ కన్వీనర్ రేసులో పాత్రికేయుడు రామాంజనేయులు ముందంజ Wed, Jun 18, 2025, 02:00 PM