దేశంలో, రాష్ట్రంలో సమస్యలపై కాంగ్రెస్‌ జోడో యాత్ర

by సూర్య | Wed, Nov 23, 2022, 03:03 PM

దేశాన్ని ప్రధాని మోదీ అమ్మేస్తున్నారని ఏపీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్‌ ధ్వజమెత్తారు. మంగళవారం గుంటూరు పర్యటనకు వచ్చిన ఆయన రాజీవ్‌గాంధీభవన్‌లో మీడియా సమావేశంలో మాట్లాడారు. దేశాన్ని మోదీ అధోగతి పాల్చేస్తుంటే కాంగ్రెస్‌ పార్టీ చూస్తూ ఊరుకోదన్నారు. ఇక్కడ విశాఖ ఉక్కు అమ్ముతుంటే ప్రధాని మోదీ సింగరేణి గనుల గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు. దేశంలో, రాష్ట్రంలో సమస్యలపై కాంగ్రెస్‌ జోడో యాత్ర కొనసాగుతుందన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య విలువలు మృగ్యమయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాజధానిగా అమరావతిని గత ప్రభుత్వం ప్రకటిస్తే అప్పుడు స్వాగతించి ఇప్పుడు ఎందుకు మాట మార్చుతున్నారో చెప్పాలని సీఎం జగన్‌ను ప్రశ్నించారు. రాజధానిని కాపాడుకునేందుకు రైతులు పాదయాత్ర చేస్తుంటే అడ్డుకుంటారా అని మండిపడ్డారు.

Latest News

 
ఏపీ సీనియర్ ఏబీ వెంకటేశ్వరరావుకు మరో టెన్షన్.. మరో 2 వారాలే, కష్టమేనా Sat, May 18, 2024, 10:21 PM
తెలుగుదేశం ఆఫీసులో వైఎస్ జగన్ ఎయిర్‌పోర్ట్ ఘటన డాక్టర్.. సంచలన ఆరోపణలు Sat, May 18, 2024, 10:16 PM
సీఎం జగన్ లండన్ వెళ్లే సమయంలో కలకలం.. ఎయిర్‌పోర్టులో అనుమానాస్పద వ్యక్తి Sat, May 18, 2024, 09:01 PM
తిరుమల శ్రీవారి దర్శనం, సేవలు.. కోర్టుకెళ్లి మరీ సాధించుకున్న ఇద్దరు భక్తులు Sat, May 18, 2024, 09:00 PM
లండన్ పర్యటకు వెళ్లిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ Sat, May 18, 2024, 08:52 PM