మరో 20 ఏళ్లపాటు జగనే సీఎం: జోగి రమేష్

by సూర్య | Wed, Oct 05, 2022, 04:00 PM

వైసీపీకి రాష్ట్ర ప్ర‌యోజ‌నాలే ముఖ్య‌మ‌ని, మ‌రో 20 ఏళ్ల దాకా జ‌గ‌నే ఏపీ సీఎంగా కొన‌సాగుతార‌ని వైసీపీకి చెందిన కీల‌క నేత‌, ఏపీ గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి ర‌మేశ్ అన్నారు. టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మారుస్తూ తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన ప్ర‌క‌ట‌న‌పై ప‌లు పార్టీల‌కు చెందిన నేత‌లు వ‌రుస‌గా స్పందిస్తున్నారు. తాజాగా ఏపీలో అధికార పార్టీగా ఉన్న  జోగి ర‌మేశ్ స్పందించారు. ఏపీలో బీఆర్ఎస్ ప్ర‌భావ‌మేమీ ఉండ‌ద‌ని ఆయ‌న అన్నారు. దేశంలో చాలా మంది పార్టీలు పెట్టుకుంటూ ఉంటార‌ని, వారి ఆలోచ‌న‌ల‌ను బ‌ట్టి ఆయా పార్టీల నిర్ణ‌యాలు ఉంటాయ‌ని కూడా ఆయ‌న వ్యాఖ్యానించారు.


ఏపీ సీఎం జ‌గ‌న్ గురించో, ఏపీ గురించో మాట్లాడితే కేసీఆర్ ద‌గ్గ‌ర మార్కులు కొట్టేయొచ్చని కొంద‌రు తెలంగాణ మంత్రులు భావిస్తున్నార‌ని జోగి ర‌మేశ్ అన్నారు. ఈ కార‌ణంగా తెలంగాణ మంత్రులు ఏపీ గురించి అప్పుడ‌ప్పుడు విమ‌ర్శ‌లు గుప్పిస్తూ ఉంటార‌ని అన్నారు. బీఆర్ఎస్సే కాదు ఏ పార్టీ వ‌చ్చినా వైసీపీని ఏమీ చేయ‌లేవ‌న్నారు. వైసీపీ ఎవ‌రికీ భ‌య‌ప‌డే పార్టీ కాద‌ని ఆయ‌న అన్నారు. ఏపీ ప్ర‌జ‌లంతా త‌మ వైపే ఉన్నార‌న్నారు. వైసీపీ చేప‌ట్టిన‌న్ని సంక్షేమ ప‌థ‌కాలు మ‌రే పార్టీ మ‌రే రాష్ట్రంలో అమ‌లు చేయ‌డం లేద‌ని ర‌మేశ్ అన్నారు. ఈ కార‌ణంగానే వ‌చ్చే ఎన్నిక‌ల్లో కూడా ఏపీలో వైసీపీనే విజ‌యం సాధిస్తుంద‌ని ఆయ‌న తెలిపారు.

Latest News

 
మే 3న రాష్ట్రంలో పర్యటించనున్న ప్రధాని Fri, Apr 26, 2024, 03:27 PM
1న ఇళ్ల వద్దే పెన్షన్లు పంపిణీ చెయ్యాలి Fri, Apr 26, 2024, 03:25 PM
కొడాలి నాని నామినేషన్ తిరష్కారించాలి Fri, Apr 26, 2024, 03:24 PM
పీయూష్ వ్యాఖ్యలను ఖండిస్తున్నాం Fri, Apr 26, 2024, 03:23 PM
అటునుండి ఇటు , ఇటునుండి అటు Fri, Apr 26, 2024, 03:22 PM