by సూర్య | Tue, Oct 04, 2022, 05:29 PM
దేవి శరన్నవరాత్రుల వేడుకల్లో భాగంగా మంగళవారం తొమ్మిదో రోజు అయిన మహార్నవమి పురస్కరించుకొని కర్నూల్ నగరంలోని పెద్ద మార్కెట్ వద్ద ఉన్న వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం నందు కర్నూలు మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి సతీసమేతంగా పాల్గొని ప్రత్యేక పూజ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయాలు అర్చకులు మోహన్ రెడ్డి దంపతులను వేదమంత్రాలతో స్వాగతం పలికారు. అనంతరం కుంకుమార్చన కార్యక్రమంలో పాల్గొన్నారు.
Latest News