by సూర్య | Tue, Oct 04, 2022, 12:26 PM
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో ఎనిమిదో రోజు మంగళవారం ఉభయదేవేరులతో కూడిన శ్రీమలయప్పస్వామివారి రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఆలయ వీధులలో మలయప్పస్వామికి భక్తులు అడుగడుగునా నీరాజనాలు సమర్పించారు. గోవిందనామస్మరణతో ఆలయ మాడవీధులు మారుమోగాయి.రథానికి తాళ్ళుకట్టి వీధులలో భక్తులు, అధికారులు అందరూ రథాన్ని ముందుకు లాగారు. వాహనసేవలో పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్స్వామి, రాష్ట్ర మంత్రి శ్రీ వేణుగోపాలకృష్ణ, టీటీడీ చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి దంపతులు, ఈవో ఎవి.ధర్మారెడ్డి దంపతులు, బోర్డు సభ్యులు పాల్గొన్నారు
Latest News