by సూర్య | Tue, Oct 04, 2022, 10:27 AM
ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాకం స్వయంభు శ్రీ వరసిద్ది వినాయక స్వామి వారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా మంగళవారం క్యూ లైన్ లలో భక్తులు నిండిపోయి ఆలయ ప్రాంగణం వరకు బారులు తీరారు. స్వామివారి దర్శనార్థం సమయపాలన కావడంతో భక్తులు వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో దేవస్థానం చైర్మన్ మోహన్ రెడ్డి మరియు ఈవో సురేష్ బాబులు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పర్యవేక్షిస్తున్నారు.
Latest News