జేఈఈ మెయిన్ పరీక్ష పత్రం లీక్ కేసులో..రష్యా జాతీయుడు అరెస్ట్

by సూర్య | Mon, Oct 03, 2022, 10:40 PM

గతేడాది జేఈఈ మెయిన్ పరీక్ష పత్రం లీక్ కావడం కలకలం రేపింది. ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేస్తోంది. తాజాగా ఈ కేసులో రష్యా జాతీయుడు మిఖాయిల్ షార్గిన్ ను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. జేఈఈ పరీక్షల కోసం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) ఐలియన్ పేరిట ప్రత్యేక సాఫ్ట్ వేర్ ను రూపొందించింది. రష్యా జాతీయుడు మిఖాయిల్ షార్గిన్ ఈ సాఫ్ట్ వేర్ ను ట్యాంపరింగ్ చేశాడన్నది అతడిపై నెలకొన్న ప్రధాన అభియోగం. 


గతేడాది ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చిన తర్వాత, మిఖాయిల్ షార్గిన్ భారత్ ను వీడి వెళ్లిపోయాడు. అతడిపై సీబీఐ లుకౌట్ నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో, మిఖాయిల్ షార్గిన్ నేడు కజకిస్థాన్ నుంచి ఢిల్లీ వచ్చాడు. అతడిని ఢిల్లీ విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్ అధికారులు నిలువరించారు. అతడిని సీబీఐ అధికారులకు అప్పగించారు. సీబీఐ అధికారులు మిఖాయిల్ షార్గిన్ ను సాఫ్ట్ వేర్ ట్యాంపరింగ్ అంశంపై ప్రశ్నిస్తున్నారు.

Latest News

 
భూ పట్టా చట్టంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు : సజ్జల Sat, May 04, 2024, 11:24 PM
ఏపీ రెయిన్ అలెర్ట్ Sat, May 04, 2024, 10:07 PM
ఈసారి ఎన్నికల్లో కూటమిని గెలిపించి మీ భవిష్యత్తును కాపాడుకోండి : పవన్ కళ్యాణ్ Sat, May 04, 2024, 09:26 PM
కొడుకు నామినేషన్‌లో బ్రిజ్ భూషణ్ హంగామా,,,,వేలాది అనుచరులు.. 700 కార్లు.. గాల్లోకి కాల్పులు Sat, May 04, 2024, 09:15 PM
సింహాచలం వెళ్లలేకపోతున్న భక్తులకు గుడ్‌న్యూస్.. చందనం, ప్రసాదం పోస్టల్‌లో పొందండిలా Sat, May 04, 2024, 08:56 PM