ప్రియాంకా గాంధీ వాద్రాతో కలిసి రాహుల్ గాంధీ యాత్ర

by సూర్య | Thu, Sep 22, 2022, 09:49 PM

కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, తన సోదరి అయిన ప్రియాంకా వాద్రాతో కలసి ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ యాత్ర చేయబోతున్నారు. ఇదిలావుంటే కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రకు రేపు (శుక్రవారం) విరామం ఇవ్వనున్నారు. ప్రస్తుతం కేరళలో యాత్రను సాగిస్తున్న రాహుల్ గాంధీ... నేటి రాత్రి ఢిల్లీ బయలుదేరనున్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో రేసులో ముందు వరుసలో ఉన్న రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ గురువారం యాత్రలో ఉన్న రాహుల్ తో సమావేశమైన సంగతి తెలిసిందే.


ఈ సందర్భంగా రాహుల్, గెహ్లాట్ ల మధ్య పార్టీ అధ్యక్ష పదవికి సంబంధించిన చర్చలు జరిగాయి. పార్టీ అధ్యక్ష పదవిని ఆశిస్తున్న ఇతర నేతలు, ఎన్నికలపై పార్టీ అధిష్ఠానం పెద్దలతో చర్చలు జరిపే నిమిత్తమే రాహుల్ గాంధీ నేటి రాత్రి ఢిల్లీ వెళ్లనున్నారు. రేపు ఢిల్లీలో ఈ చర్చలన్నింటినీ ముగించుకుని ఎల్లుండి (శనివారం) ఉదయానికి రాహుల్ తిరిగి కేరళ చేరుకుంటారు. ఈ దఫా ఆయన తన సోదరి ప్రియాంకా గాంధీ వాద్రాతో కలిసి యాత్రను ప్రారంభించనున్నట్లుగా పార్టీ వర్గాలు తెలిపాయి.

Latest News

 
పిఠాపురంలో సాయిధరమ్ తేజ్ మాస్ స్పీచ్.. అరుపులే, అరుపులు Sun, May 05, 2024, 10:18 PM
ఏపీలో రేపటి నుంచి వానలు.. ఆ జిల్లాలలో పిడుగులు పడే ఛాన్స్ Sun, May 05, 2024, 10:14 PM
ఇటుకల బట్టీలో అనుమానం.. వెళ్లి ఓ గది తలుపులు తీసిన పోలీసులు షాక్ Sun, May 05, 2024, 08:49 PM
ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. పోలింగ్‌కు ముందే ఒక రోజు సెలవు, ఆదేశాలు వచ్చేశాయి Sun, May 05, 2024, 08:45 PM
తిరుమలకు వెళ్లే భక్తులకు గుడ్‌న్యూస్.. ప్రత్యేక రైళ్లు, ఈ స్టేషన్‌లలో ఆగుతాయి Sun, May 05, 2024, 08:42 PM