సాధువులమని చెప్పి,,,,నకిలీ బాబాల దొంగతనం

byసూర్య | Sun, Oct 27, 2024, 07:41 PM

కాషాయ వస్త్రాలు ధరించారు.. జుట్టు గడ్డాలు పెంచుకున్నారు.. చూసేందుకు అచ్చం సాధువుల్లాగే ఉన్నారు. మాట తీరు కూడా అలాగే ఉంది. పైగా కారులో వస్తున్నారు. అటుగా వెళ్తున్న ఓ రిటైర్డ్ టీచర్‌ను ఆపి.. మాటల్లో పెట్టారు. సేద తీరేందుకు ఏదైనా ఆశ్రయం దొరుకుతుందా అని మొదలుపెట్టి.. ఆయన జాతకం చెప్పటం ప్రారంభించారు. అప్పటికైనా ఆ టీచర్ అర్థం చేసుకోవాల్సింది కానీ.. వాళ్ల మాటలు, వేషాధారణ చూసి.. నిజమైన బాబాలేనేమో అనుకుని మోసపోయి.. అరతులం బంగారం సమర్పించుకోవాల్సి వచ్చింది. అసలు విషయం అర్థమై పోలీసులకు ఫిర్యాదు చేస్తే.. ఆ దొంగబాబాల భాగోతం బయటపడింది. ఈ ఘటన.. రంగారెడ్డి జిల్లా యాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.


యాచారం మండల పరిధిలోని తక్కల్ల పల్లి గ్రామానికి చెందిన రిటైర్డ్ టీచర్ దేంది మాధవరెడ్డి, నాగార్జున సాగర్ రోడ్డు తక్కల్లపల్లి గేటు దగ్గరి నుంచి తమ గ్రామానికి నడుచుకుంటూ వెళ్తున్నాడు. అలా వెళ్తున్న సమయంలోనే.. ఓ కారు వెళ్తూ కొద్ది దూరంలోనే ఆగింది. అందులో నుంచి ఓ ముగ్గురు కాషాయం ధరించిన బాబాలు కిందికి దిగారు. మాధవరెడ్డి దగ్గరికి వచ్చి.. తాము గుజరాత్‌ నుంచి వస్తున్నామని.. సేద తీరడానికి దగ్గరలో ఏమైనా ఆలయాలున్నాయా అని అడిగారు. దీంతో.. మాధవరెడ్డి వారి వేషధారణ, మాట తీరు చూసి.. నిజమైన బాబాలేనని నమ్మి.. తనకు తెలిసిన ఆలయాల అడ్రస్‌ చెప్పాడు.


కానీ.. ఆ దొంగ సాధువులు మాత్రం మాధవరెడ్డిని పూర్తిగా నమ్మించేందుకు.. మాటల్లో పెట్టారు. తమకు మాట సాయం చేసినందుకు గానూ.. తమ అనుగ్రహం ప్రసాధిస్తామని చెప్పారు. ఈ క్రమంలోనే.. తమ దగ్గరున్న రుద్రాక్షలను తీసి మాధవరెడ్డి చేతిలో పెట్టారు. ఈ మంత్రించి ఇచ్చిన రుద్రాక్షలను ధరిస్తే తిరుగు ఉండదని.. అంతా మంచే జరుగుతుందని రుద్రాక్ష మాలతో పాటు విభూది కూడా ఇచ్చి.. అక్కడి నుంచి కారులో బయలుదేరి వెళ్లిపోయారు.


అయితే.. ఆ బాబాలను పూర్తిగా నమ్మిన మాధవరెడ్డి.. వారి మాయలో పడిపోయాడు. వాళ్లు అక్కడి నుంచి వెళ్లిపోయిన తర్వాత.. తన చేతిలో పెట్టిన రుద్రాక్ష, విభూదిని చూసుకోగా.. అదే సమయంలో చేతికి ఉన్న బంగారు ఉంగరం కనిపించలేదు. దీంతో.. ఒక్కసారిగా అవాక్కయ్యాడు. అసలు విషయం ఏంటంటే.. ఆ రుద్రాక్ష, విభూది ఇచ్చిన సమయంలోనే.. ఏమాత్రం తెలియకుండా చేతి నుంచి అర్ధతులం ఉన్న బంగారు ఉంగరాన్ని కొట్టేశారు ఆ దొంగబాబాలు. ఈ విషయం వాళ్లు వెళ్లిపోయిన తర్వాత గుర్తించటంతో.. హుటాహుటిన పోలీస్ స్టేషన్‌కు వెళ్లి జరిగిందంతా పూసు గుచ్చినట్టు పోలీసులకు వివరించాడు.


దీంతో.. రంగంలోకి దిగిన పోలీసులు.. ముమ్మర తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలోనే... మాల్ చెక్ పోస్ట్ తనిఖీలు చేపట్టగా అనుమాదస్పదంగా కనిపించిన దొంగ బాబాలను అదుపులోకి తీసుకొని.. తమదైన శైలిలో విచారిస్తే.. అసలు విషయం బయటపడింది. దీంతో.. ఆ ముగ్గురు దొంగ బాబాలతో పాటు ఓ సివిల్ వ్యక్తిని కూడా పోలీసులు అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. సాధువుల అవతారం ధరించింది.. గుజరాత్ రాష్ట్రానికి చెందిన కవార్నాథ్ మధారి (40), సావ్ నాథ్ (32), పర్దేశి నాథ్ (25), ప్రేమ్ నాథ్ (22) అని పోలీసులు తెలిపారు.



Latest News
 

అది ఫాంహౌస్ కాదు.. నా బావమరిది ఇల్లు, రేవ్ పార్టీ కాదు.. ఫ్యామిలీ ఫంక్షన్: కేటీఆర్ Sun, Oct 27, 2024, 11:31 PM
హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం.. బాణసంచా దుకాణంలో మంటలు Sun, Oct 27, 2024, 11:30 PM
జగిత్యాలలో వింత ఘటన.. ఇదెక్కడి మాయ.. బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజమైందా Sun, Oct 27, 2024, 11:27 PM
డిజిటల్ అరెస్ట్’పై వీడియో షేర్ చేసినందుకు ప్రధానికి తెలంగాణ ఐపీఎస్ అధికారి ధన్యవాదాలు Sun, Oct 27, 2024, 09:16 PM
హైదరాబాద్ అభివృద్ధిలో యాదవుల పాత్రను తెలంగాణ సీఎం కొనియాడారు Sun, Oct 27, 2024, 09:02 PM