byసూర్య | Sun, Sep 29, 2024, 10:40 PM
ఆదిలాబాద్ పట్టణంలో రసవత్తరంగా సాగిన పీఆర్టీయూ టీఎస్ ఎన్నికల ఫలితాల్లో ఒకే ప్యానల్ కు చెందిన వారు గెలుపొందారు. ఆదివారం రాత్రి ఎన్నికల ఫలితాలు ఎన్నికల అధికారులు వెల్లడించారు.
జిల్లా అధ్యక్షులుగా మరో సారి కొమ్ము కృష్ణ కుమార్ విజయం సాధించారు. ప్రధానకార్యదర్శిగా ఆయన ప్యానల్ కె చెందిన తిరుతోపు నరసింహ స్వామి గెలుపొందారు. ఫలితాలు వెలువడిన అనంతరం గెలుపొందిన ప్యానెల్ కు చెందిన వారు సంబరాలు నిర్వహించారు.