byసూర్య | Tue, Jun 18, 2024, 03:14 PM
నాగర్ కర్నూలు జిల్లా ఉప్పునుంతల మండలం పరిధిలోని పెద్దాపూర్ గ్రామంలో ప్రభుత్వ రోడ్డు ఆక్రమణకు గురవుతుంది. వ్యవసాయ పొలాల మీదుగా ఉన్న ఈ రోడ్డును ప్రతి సంవత్సరం రైతులు కొంత ఆక్రమించి సాగు చేస్తున్నారు. 60 ఫీట్లుగా ఉన్న రోడ్డు ఇప్పుడు 20 ఫీట్లకు తగ్గిపోయింది. దాంతోపాటు రోడ్డుకు ఇరువైపులా ఏర్పాటు చేసిన హరితహారం మొక్కలను కొట్టివేస్తున్నారు. రోడ్డు, మొక్కలను కాపాడాలని గ్రామస్తులు మంగళవారం కోరారు.