ఓపెన్ ఇంటర్ పరీక్షలో కాంగ్రెస్ నాయకుడి భార్య మాల్ ప్రాక్టీస్

byసూర్య | Thu, May 02, 2024, 01:50 PM

సూర్యాపేట - హుజూర్ నగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఓపెన్ ఇంటర్ పరీక్షలు జరుగుతుండగా.. ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు భూక్యా మంజి నాయక్ భార్య కాంగ్రెస్ నాయకురాలు మఠంపల్లి మాజీ జడ్పిటిసి ధీరవత్ నీలా (అలియాస్ భూక్యా నీలా) పరీక్ష రాసేది ఉండగా తనకు బదులుగా చింతలపాలెం మండలం నక్కగూడెం గ్రామానికి చెందిన భూక్యా నాగమణి అనే మహిళతో పరీక్షలు రాపించుకుంటుంది.
గమనించిన ఇన్విజిలేటర్ షేక్ ఉస్మాన్ ఆరా తీయగా తేజ స్కూల్ కోఆర్డినేటర్ గురువయ్య మధ్యవర్తి ద్వారా పరీక్షలు రాస్తున్నానని భూక్యా నాగమణి ఒప్పుకుంది. మాల్ ప్రాక్టీస్ చేస్తున్నారని కాంగ్రెస్ నాయకురాలు ధీరవత్ నీలా (అలియాస్ భూక్యా నీలా), నాగమణి, గురవయ్య ముగ్గురుపై పోలీస్ శాఖ FIR NO:108/2024 IPC:419,420 సెక్షన్ల కింద కేసు నమోదు చేసింది.


Latest News
 

రెండు ఐచర్ వాహనాలు ఢీ.. నలుగురికి తీవ్ర గాయాలు Thu, May 16, 2024, 08:07 PM
అయిజ సహకార సంఘాన్ని ఆదర్శంగా తీసుకోవాలి Thu, May 16, 2024, 08:00 PM
డిజిపికి ఫిర్యాదు చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ Thu, May 16, 2024, 07:59 PM
క్షతగాత్రులను పరామర్శించిన ఎమ్మెల్యే Thu, May 16, 2024, 07:46 PM
యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి Thu, May 16, 2024, 07:45 PM