byసూర్య | Tue, Apr 23, 2024, 11:55 AM
బాన్సువాడ పట్టణంలోని పంచముఖి హనుమాన్ ఆలయానికి హనుమాన్ జయంతి సందర్భంగా మంగళవారం రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజ్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు శాలువా, ఫొటోతో బహుకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు కాసుల సాయిలు, అందే చిరంజీవి, రవీందర్ రెడ్డి, సహారా రాజు, శ్రీనివాస గుప్తా, బోడ భాస్కర్, కొట్టం గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.