byసూర్య | Sat, Apr 20, 2024, 03:30 PM
చిలుకూరు శ్రీవారి బ్రహ్మోత్సవాలు శుక్రవారం నుండి ప్రారంభమయ్యాయి. ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయ ప్రధానార్చకులు రంగరాజన్ కీలక ప్రకటన చేశారు. సంతానం లేని స్త్రీలకు శుక్రవారం గరుడ ప్రసాదం ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఈ విషయం కాస్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో శుక్రవారం ఉదయం 5 గంటల నుండే ఆలయానికి జనం బారులుగా తరలివచ్చారు. ఆలయానికి వచ్చేవారి వాహనాల రద్దీ పెరగడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.