byసూర్య | Sat, Apr 20, 2024, 12:29 PM
భిక్కనూరు మండల కేంద్రంలో జరుగుతున్న పెద్దమ్మ ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం పెద్దమ్మ పెద్దిరాజుల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ఉత్సవ విగ్రహాలను పట్టణంలోని ప్రధాన వీధుల గుండా ఊరేగించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో అమ్మవారి కళ్యాణం ఘనంగా నిర్వహించారు. పలు ప్రాంతాల నుండి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారి కళ్యాణాన్ని తిలకించారు. మహిళలు ఓడిబియ్యం పోసి మొక్కులు తీర్చుకున్నారు.