byసూర్య | Thu, Apr 11, 2024, 10:28 AM
రాష్ట్రంలో నెలకొన్న రైతాంగ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో బుధవారం యాదాద్రి జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించి అనంతరం కలెక్టరేట్లో వినతి పత్రం అందించారు. ఏఐకేఎంఎస్ రాష్ట్ర అధ్యక్షులు మామిడాల బిక్షపతి మాట్లాడుతూ. ఆరుగాలం కష్టపడి పండించిన పంట అకాల వర్షాలతో, ఈదురు గాలులతో నేలమట్టమైన రైతాంగాన్ని ఆదుకోవాలని ఏఐకేఎంఎస్ రాష్ట్ర అధ్యక్షులు మామిడాల బిక్షపతి కోరారు.