byసూర్య | Fri, Mar 29, 2024, 09:02 AM
హైదరాబాద్లోని ఎల్బీనగర్లో బీజేపీ ముఖ్య కార్యకర్తల సమావేశం భారీ ఎత్తున జరిగింది. ఈ సమావేశంలో మల్కాజిగిరి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్, మాజీ ఎమ్మెల్సీ రామచందర్ రావు, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు సామ రంగారెడ్డి, కార్పొరేటర్లు పాల్గొన్నారు.
పేదల అభివృద్ధికి మోదీ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని ఈటల రాజేందర్ అన్నారు. రాష్ట్రంలో బీజేపీ అత్యధిక స్థానాల్లో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈటల రాజేందర్ మాట్లాడుతూ మోసాలు లేని దేశంగా మోదీ తీర్చిదిద్దారన్నారు.