నేడే ఏసీ స్లీపర్ బస్సులు ప్రారంభం
byసూర్య |
Mon, Mar 27, 2023, 08:01 AM
ప్రయాణికుల సౌకర్యార్థం TSRTC మరో ముందడుగు వేసింది. తొలిసారి 16 ఏసీ స్లీపర్ బస్సులను నేడు ప్రారంభించనుంది. ఈ బస్సుల్లో ఉచిత వై-ఫై సౌకర్యాన్ని అందించనుంది. ఇవి బెంగళూరు, హుబ్లీ, విశాఖపట్నం, తిరుపతి, చెన్నై మార్గాల్లో నడుస్తాయి. హైదరాబాద్ ఎల్బీనగర్లోని విజయవాడ మార్గంలో సోమవారం ఉదయం 9.30 గంటలకు ఈ కొత్త ఏసీ స్లీపర్ బస్సులను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ప్రారంభించనున్నారు.
Latest News