byసూర్య | Sun, Mar 26, 2023, 09:04 AM
గుడిహత్నూర్ మండలంలోని శాంతాపూర్, మన్నూర్ గ్రామంలో ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా శనివారం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని టిడిపి పార్టీ మండల అధ్యక్షుడు పిట్ల మహేందర్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసి బోథ్ నియోజకవర్గ ఇన్చార్జి ఆత్రం జ్ఞాన సుధా పార్టీ కరపత్రాలను అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తుందన్నారు. అభివృద్ధి, సంక్షేమం పథకాల అమలుతో తెలంగాణ ప్రజల జీవన ప్రమాణాలను పెంచిన ఘనత టీడీపీదేనని అన్నారు. సీఎం కేసీఆర్ దొరల పాలన సాగిస్తూ అన్ని వర్గాల ప్రజలను విస్మరిస్తున్నారని ఆరోపించారు.ఈ కార్యక్రమంలో పార్లమెంట్ అధికార ప్రతినిధి రేసు పోత రెడ్డి , మండల పార్టీ అధ్యక్షులు సోమ గంగారెడ్డి , పిట్ల మహేందర్ , లక్ష్మణ్ , శభు ఎంపీటీసీ అభ్యర్థి , తదితరులు పాల్గొన్నారు.