ఎయిర్‌పోర్ట్‌కు వచ్చే వాహనాలపై ప్రత్యేక నిఘా

byసూర్య | Wed, Jan 25, 2023, 11:49 PM

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు వచ్చే వాహనాలపై ప్రత్యేక నిఘా పెట్టారు. రిపబ్లిక్ డే సందర్భంగా.. సీఐఎస్ఎఫ్ సెక్యూరిటీ అధికారులు, పోలీసులు ముందస్తు జాగ్రత్తగా ఎయిర్‌పోర్టు వద్ద రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే అక్కడ కట్టుదిట్టమైన ఏర్పాట్లు కూడా చేశారు. ఈ నెల జనవరి 31వ తేదీ వరకు ఎయిర్‌పోర్ట్‌ వద్ద రెడ్ అలర్ట్ కొనసాగుతుందని సీఐఎస్ఎఫ్ సెక్యూరిటీ అధికారులు, పోలీసులు వెల్లడించారు. ఈమేరకు శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు వచ్చే సందర్శకులకు జనవరి 31వ తేదీ వరకు అనుమతి లేదంటూ పోలీసులు సూచించారు.


ఎయిర్‌పోర్ట్ వద్ద ఎటువంటి అవాంఛనీయమైన సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తగా పోలీసులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. అంతేకాకుండా ఎయిర్‌పోర్ట్ ప్రధాన దారిలో బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ తనిఖీలు నిర్వహించారు. జనవరి 31 వరకు ప్రయాణీకులు కూడా తమతో అన్ని గుర్తింపు కార్డులు తప్పనిసరిగా ఉంచుకోవాలని కోరుతున్నారు. ఈ క్రమంలోనే సెక్యూరిటీ అధికారులు, పోలీసులు ఎయిర్ పోర్టుకు వచ్చే వాహనాలపై ప్రత్యేక నిఘా పెట్టారు. అనుమానం వచ్చిన వాహనాలను తనిఖీ చేస్తున్నారు.



Latest News
 

భారీ వర్షానికి తడిసిన ధాన్యం Sat, May 18, 2024, 05:25 PM
ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలి : ఆర్డీవో రమేష్ రాథోడ్ Sat, May 18, 2024, 05:23 PM
రామకృష్ణను పరామర్శించిన బీజేపీ ఎంపీ అభ్యర్థి Sat, May 18, 2024, 05:21 PM
పిట్లంలో ఘనంగా నిర్వహించిన వాసవి మాత జయంతి వేడుకలు Sat, May 18, 2024, 05:20 PM
ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్ పై నెగ్గన అవిశ్వాసం Sat, May 18, 2024, 05:18 PM