మంత్రి కేటీఆర్ ను కలిసిన ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య

byసూర్య | Tue, Dec 06, 2022, 12:12 PM

నకిరేకల్ నియోజకవర్గంలోని చిట్యాల, నకిరేకల్ మున్సిపాలిటీలలో అభివృద్ధికి నిధులు కేటాయించాలని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ను ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కోరారు. నకిరేకల్ పట్టణంలో కాలంవారికుంట సుందరీకరణకు రూ. 4. 64 కోట్లు, కడపర్తి రోడ్డుకు రూ. 2. 94 కోట్లు, పట్టణంలో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికీ రూ. కోటి, చిట్యాల మున్సిపాలిటిలో అభివృద్ధికి రూ. కోటి కేటాయించాలని విజ్ఞప్తి చేస్తూ మంత్రిని ప్రగతిభవన్ లో సోమవారం కలిసి వినతిపత్రం అందజేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. కేటీఆర్ సానుకూలంగా స్పందించి వారం రోజుల్లో నిధుల మంజూరుకు హామీ ఇచ్చారని  వెల్లడించారు. మున్సిపాలిటీల, నియోజకవర్గ అభివృద్ధికి పూర్తి సహకారం ఉంటుందని మంత్రి అన్నట్లు వివరించారు.


Latest News
 

ఓటింగ్‌కు వెళ్లినవారికి రైల్వేశాఖ గుడ్‌న్యూస్.. తెలుగు రాష్ట్రాల మధ్య స్పెషల్ ట్రైన్, వివరాలివే Tue, May 14, 2024, 09:22 PM
తెలంగాణకు వర్ష సూచన.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ Tue, May 14, 2024, 09:15 PM
అన్ని సెగ్మెంట్లలో పెరిగిన పోలింగ్ శాతం.. కాంగ్రెస్ బలంగా ఉన్న ఆ రెండు స్థానాల్లో మాత్రం తగ్గింది Tue, May 14, 2024, 09:11 PM
తెలంగాణలో కాంగ్రెస్ పక్కాగా గెలిచే ఎంపీ స్థానాలివే.. భట్టి ఎగ్జిట్ పోల్స్ Tue, May 14, 2024, 09:06 PM
పట్నం ప్రజలకంటే పల్లె జనం నయం.. 100 శాతం పోలింగ్.. ఆదర్శంగా నిలిచిన తండా Tue, May 14, 2024, 09:01 PM