byసూర్య | Tue, Dec 06, 2022, 12:12 PM
నకిరేకల్ నియోజకవర్గంలోని చిట్యాల, నకిరేకల్ మున్సిపాలిటీలలో అభివృద్ధికి నిధులు కేటాయించాలని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ను ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కోరారు. నకిరేకల్ పట్టణంలో కాలంవారికుంట సుందరీకరణకు రూ. 4. 64 కోట్లు, కడపర్తి రోడ్డుకు రూ. 2. 94 కోట్లు, పట్టణంలో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికీ రూ. కోటి, చిట్యాల మున్సిపాలిటిలో అభివృద్ధికి రూ. కోటి కేటాయించాలని విజ్ఞప్తి చేస్తూ మంత్రిని ప్రగతిభవన్ లో సోమవారం కలిసి వినతిపత్రం అందజేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. కేటీఆర్ సానుకూలంగా స్పందించి వారం రోజుల్లో నిధుల మంజూరుకు హామీ ఇచ్చారని వెల్లడించారు. మున్సిపాలిటీల, నియోజకవర్గ అభివృద్ధికి పూర్తి సహకారం ఉంటుందని మంత్రి అన్నట్లు వివరించారు.