కోమటి రెడ్డి బ్రదర్స్ కు కాంగ్రెస్ ఎంతో చేసింది

byసూర్య | Sat, Aug 06, 2022, 08:12 PM

కోమటిరెడ్డి సోదరులకు కాంగ్రెస్ పార్టీ ఎంతో చేసిందని ఎన్నో పదవులు ఇచ్చిందని టీ.కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి వెల్లడించారు. ఇద్దరికీ కాంగ్రెస్ పార్టీ ఎన్నో అవకాలను కల్పించిందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ద్వారా ఎంతో లబ్ధి పొందిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరడం దారుణమని అన్నారు. 


ఏపీలో కేఏ పాల్, తెలంగాణలో రాజగోపాల్ ఇద్దరూ ఒకటేనని... ఏం మాట్లాడతారో వారికే తెలియదని చెప్పారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇద్దరూ ఒకే రోజు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారని... వెంకటరెడ్డి తీరును చూస్తుంటే ఆయన కూడా బీజేపీలో చేరడం ఖాయంగా కనిపిస్తోందని చెప్పారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి చండూరు సభకు హాజరు కాకుండా... అమిత్ షాను కలిసేందుకు ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు.


Latest News
 

కాంగ్రెస్ కార్యకర్తలకు అండగా ఉంటా.. Sat, May 18, 2024, 05:01 PM
రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తాం Sat, May 18, 2024, 04:57 PM
ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది: ఆర్డీవో Sat, May 18, 2024, 04:54 PM
సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి Sat, May 18, 2024, 04:52 PM
29న ఘంటసాల కాంస్య విగ్రహం ఆవిష్కరణ Sat, May 18, 2024, 04:46 PM