దిశ నిందితుల ఎన్ కౌంటర్ బూటకం: సిర్పూర్కర్ కమిషన్
byసూర్య |
Fri, May 20, 2022, 02:49 PM
దిశ నిందితుల ఎన్ కౌంటర్ బూటకం అని సిర్పూర్కర్ కమిషన్ నివేదిక ఇచ్చింది. మొత్తం 387 పేజీలతో సిర్పూర్కర్ కమిషన్ సుప్రీంకోర్టుకు నివేదిక ఇచ్చింది. నిందితులను కావాలనే ఎన్ కౌంటర్ చేశారని కమిషన్ తన నివేదికలో పేర్కొంది. పోలీసులు గాయపడి ఆస్పత్రిలో చేరడం కట్టుకథ అని, నిందితుల్లో ముగ్గురు మైనర్లు అన్న విషయాన్ని కూడా దాచారని సిర్పూర్కర్ కమిషన్ నివేదిక తేల్చింది. 10 మంది పోలీస్ అధికారులు ఈ ఎన్ కౌంటర్ లో పాల్గొన్నారని, పోలీసులపై హత్యా నేరం కింద విచారణ జరపాలని కమిషన్ సూచించింది. ఎదురుకాల్పుల్లో మరణించారన్న పోలీసుల వాదన నమ్మశక్యం లేదని తెలిపింది. ఈ కేసుపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. సుప్రీంకోర్టు ఈ కేసును హైకోర్టుకు బదిలీ చేసింది.
Latest News