జులైలో గ్రూప్‌-2 ఇంటర్వ్యూలు : ఘంటా చక్రపాణి

byసూర్య | Wed, Jun 19, 2019, 01:59 PM

 గ్రూప్‌-2 ఉద్యోగాలకు అర్హత సాధించిన అభ్యర్థులకు టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌ ఘంటా చక్రపాణి శుభవార్త వినిపించారు. జులై మొదటి వారంలో గ్రూప్‌-2 ఇంటర్వ్యూల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నామని చక్రపాణి స్పష్టం చేశారు. రాజ్‌భవన్‌లో గవర్నర్‌ నరసింహన్‌ను ఘంటా చక్రపాణి కలిసి టీఎస్‌పీఎస్సీ 2017-18 వార్షిక నివేదికను అందజేశారు. ఈ సందర్భంగా చక్రపాణి మీడియాతో మాట్లాడారు. గ్రూప్‌-2 ఇంటర్వ్యూలకు 2 వేలకు పైగా అభ్యర్థులు హాజరవుతారని, ఇంటర్వ్యూలన్ని పారదర్శకంగా నిర్వహిస్తామని తెలిపారు. టీఆర్టీ జాబితా ఎంపిక పూర్తయింది.. ఆ నివేదికను ప్రభుత్వానికి పంపామని చెప్పారు. విద్యాశాఖ ఆమోదించగానే త్వరలోనే నియామకాలు పూర్తి చేస్తామని ఘంటా చక్రపాణి స్పష్టం చేశారు.


Latest News
 

నేటి నుంచే ఓటింగ్ ప్రారంభం.. పోలింగ్ కేంద్రాల్లో కాదు ఇంటి నుంచే Fri, May 03, 2024, 07:46 PM
నన్ను నేరుగా కోర్టులో హాజరుపర్చండి.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కొత్త పిటిషన్ Fri, May 03, 2024, 07:43 PM
భర్తను గొలుసులతో కట్టేసిన భార్య.. ఆ విషయంలో గొడవలు Fri, May 03, 2024, 07:40 PM
స్టూడెంట్ రోహిత్ వేముల కేసు క్లోజ్.. పోలీసుల వివరణ ఇదే.. వాళ్లందరికీ ఉపశమనం Fri, May 03, 2024, 07:36 PM
ఎన్నికల వేళ తీన్మార్ మల్లన్న సంచలన నిర్ణయం.. తన ఆస్తులన్నీ ప్రభుత్వానికే Fri, May 03, 2024, 07:33 PM