by సూర్య | Mon, Aug 19, 2019, 03:58 PM
సుజిత్ దర్శకుడిగా ప్రభాస్ కథానాయకుడిగా రూపొందిన 'సాహో' ఈ నెల 30వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుంచి 'బ్యాడ్ బాయ్' అంటూ సాగే సాంగును విడుదల చేశారు. ప్రభాస్ .. జాక్విలిన్ ఫెర్నాండేజ్ కాంబినేషన్ పై చిత్రీకరించిన ఈ పాట యూత్ కి నచ్చేలా వుంది.
ప్రభాస్ చాలా స్టైలీష్ గా కనిపిస్తూ అభిమానుల్లో మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నాడు. 400 కోట్ల రూపాయల బడ్జెట్ తో యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమాలో, ప్రభాస్ సరసన నాయికగా శ్రద్ధా కపూర్ నటించింది. తెలుగుతో పాటు తమిళ .. మలయాళ .. కన్నడ .. హిందీ భాషల్లోను ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఆయా భాషలకి చెందిన నటీనటులు ముఖ్యమైన పాత్రలను పోషించిన ఈ సినిమా, అంతకంతకూ అంచనాలు పెంచేస్తూ వెళుతోంది.
Latest News