28న జరగనున్న ఏఎన్ఆర్ అవార్డుల కార్యక్రమానికి ఆహ్వానం

by సూర్య | Fri, Oct 25, 2024, 02:42 PM

మెగాస్టార్ చిరంజీవిని హీరో నాగార్జున కలిశారు. ఈ నెల 28న జరగనున్న ఏఎన్ఆర్ అవార్డుల కార్యక్రమానికి మెగాస్టార్‌ను ఆహ్వానించారు. ఈ మేరకు నాగార్జున ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. ఈ ఏడాది తమకు చాలా ప్రత్యేకమని, తన తండ్రి శతజయంతి వేడుకలకు అమితాబ్ బచ్చన్, చిరంజీవి‌ని ఆహ్వానించినట్లు పేర్కొన్నారు. వారి రాక తమకు మరింత గౌరవంగా మారనుందని పేర్కొన్నారు. ఈ వేడుకను మరుపురానిదిగా చేద్దామని రాసుకొచ్చారు.అక్టోబర్ 28న అన్నపూర్ణ స్టూడియోలో అక్కినేని శతజయంతి వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి అమితాబ్ బచ్చన్ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. అమితాబ్ చేతుల మీదుగా చిరంజీవి అక్కినేని జాతీయ పురస్కారం అందుకోనున్నారు. చిరంజీవిని వేడుకకు ఆహ్వానిస్తున్న ఫొటోలను నాగార్జున తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు.

Latest News
 
ఈ వారం OTTలో విడుదల కానున్న సిరీస్ మరియు సినిమాలు Fri, Oct 25, 2024, 02:53 PM
నేటి ప్రైమ్‌టైమ్ సినిమాలు Fri, Oct 25, 2024, 02:48 PM
సాలిడ్ టీఆర్పీని నమోదు చేసిన 'గుంటూరు కారం' Fri, Oct 25, 2024, 02:42 PM
మెడ్రన్ లుక్కులో మరింత అందంగా అంజు కురియన్ Fri, Oct 25, 2024, 02:30 PM
అన్‌స్టాపబుల్ సీజన్ 4 ఫస్ట్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ ఈరోజే Fri, Oct 25, 2024, 02:24 PM