విడాకులు తీసుకోనున్న ప్ర‌ముఖ గాయ‌కుడు!

by సూర్య | Sat, Jun 15, 2019, 08:13 PM

కన్నడ గాయకుడు రఘు దీక్షిత్, డాన్సర్ మయూరి విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. విడాకుల కోసం ఈ జంట బెంగుళూరు ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కొద్దిరోజులుగా వీరిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయట. దీని కారణం ఒక విధంగా మీటూ ఉద్యమమనే చెప్పాలి. అప్పటివరకు అన్యోన్యంగా ఉన్న ఈ జంటకి మీటూ సెగ తగిలింది. ఏడాది క్రితం రఘుపై మీటూ ఆరోపణలు వచ్చాయి. దీంతో వీరిద్దరి మధ్య వివాదాలు ఏర్పడ్డాయి. కొంతకాలంగా ఇద్దరూ వేర్వేరుగా ఉంటున్నారు. వీరి విషయంలో పెద్దలు కల్పించుకున్నా ప్రయోజనం లేకుండా పోయింది. పెద్దల సమక్షంలో సామరస్యంగా విడిపోవాలని నిర్ణయించుకున్నారు. దీంతో ఇద్దరూ విడాకుల కోసం కోర్టులో కేసు దాఖలు చేశారు. న్యాయమూర్తి ఆరు నెలల పాటు ఈ కేసును వాయిదా వేశారు. 

Latest News
 
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీ ఖరారు చేసిన 'చంద్రముఖి 2' Thu, Apr 25, 2024, 09:26 PM
సాలిడ్ టిఆర్పీని నమోదు చేసిన 'లియో' Thu, Apr 25, 2024, 09:23 PM
అనుపమ తదుపరి టైటిల్ మరియు కాన్సెప్ట్ వీడియోని లాంచ్ చేయనున్న సమంత, రాజ్ అండ్ DK Thu, Apr 25, 2024, 09:19 PM
'ఫ్యామిలీ స్టార్' నుండి దేఖో రే దేఖో వీడియో సాంగ్ అవుట్ Thu, Apr 25, 2024, 09:17 PM
షాకింగ్ టిఆర్పిని నమోద చేసిన 'ఆదికేశవ' Thu, Apr 25, 2024, 09:13 PM