'సత్యం సుందరం : AMB సినిమాస్ కి రానున్న కార్తీ

by సూర్య | Tue, Oct 01, 2024, 05:06 PM

సి. ప్రేమ్ కుమార్‌ దర్శకత్వంలో కోలీవుడ్ నటుడు కార్తీ నటించిన 'మెయ్యళగన్' సెప్టెంబర్ 27న విడుదల అయ్యింది. ఈ సినిమా తెలుగులో సత్యం సుందరం అనే టైటిల్ తో సెప్టెంబర్ 28న విడుదల అయ్యింది. ఈ సినిమాని తెలుగులో ప్రముఖ ప్రొడక్షన్ బ్యానర్ ఆసియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్ LLP విడుదల చేసింది. ఈ ప్రాజెక్ట్‌కి దర్శకత్వం చేయడమే కాకుండా, ప్రేమ్ కుమార్ ఈ సినిమాకి కథ, స్క్రీన్‌ప్లే మరియు డైలాగ్‌లు రాశారు. తాజాగా చిత్ర బృందం ఈ సినిమా సక్సెస్ ఆయినా సందర్భంగా మీట్ అండ్ గ్రీట్ అనే ప్రోగ్రాంలో భాగంగా హైదరాబాద్ లో ఈరోజు సాయంత్రం 6:50 గంటలకి AMB సినిమాస్ కి వెళ్లనున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని తెలియజేసేందుకు మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించారు. అరవింద్ స్వామి కూడా ఈ సినిమాలో ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో రాజ్‌కిరణ్, శ్రీ దివ్య, స్వాతి కొండే, దేవదర్శిని, జయప్రకాష్, శ్రీ రంజని, ఇళవరసు, కరుణాకరన్, శరణ్, రేచల్ రెబెక్కా, ఆంథోని, రాజ్‌కుమార్, ఇందుమతి, రాణి సంయుక్త, కాయల్ సుబ్రమణి, అశోక్ పాండియన్, తదితరులు కీలక పాత్రలలో నటించారు. గోవింద్ వసంత ఈ సినిమాకి స్వరాలు సమకూరుస్తున్నారు. 2డి ఎంటర్‌టైన్‌మెంట్‌పై జ్యోతిక మరియు సూర్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు, రాజశేఖర్ కర్పూరసుందరపాండియన్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

Latest News
 
3M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'మ్యాడ్ స్క్వేర్' ఫస్ట్ సింగల్ Tue, Oct 01, 2024, 07:00 PM
'కాళీ' నుండి హలో హలో సాంగ్ అవుట్ Tue, Oct 01, 2024, 06:56 PM
స్టార్ క్రికెటర్‌తో అనన్య డేటింగ్... క్లారిటీ ఇచ్చిన నటి Tue, Oct 01, 2024, 06:52 PM
రజనీకాంత్‌కి సర్జరీ పూర్తి Tue, Oct 01, 2024, 06:39 PM
CBFC సూచించిన 13 కట్స్ కి అంగీకరించిన కంగనా రనౌత్ Tue, Oct 01, 2024, 06:31 PM