'లగ్గం' నైజాం రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్

by సూర్య | Sat, Sep 28, 2024, 04:41 PM

సుబిషి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై వేణు గోపాల్ రెడ్డి నిర్మించిన భారీ అంచనాల చిత్రం "లగ్గం" కి రమేష్ చెప్పాల రచించి, దర్శకత్వం వహించారు. షూటింగ్ పూర్తి చేసుకున్న 'లగ్గం' పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ చిత్రం అక్టోబర్ 25న విడుదల కానుంది. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క నైజాం, సీడెడ్, ఆంధ్ర థియేటర్ రైట్స్ ని ఆసియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్ LLP బ్యానర్ సొంతం చేసుకున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు చిత్ర బృందం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. చరణ్ అర్జున్ సంగీతం అందించిన ఈ చిత్రంలో సాయి రోనక్ మరియు ప్రజ్ఞా నగ్రా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. రాజేంద్ర ప్రసాద్, రోహిణి, సప్తగిరి, ఎల్బీ శ్రీరామ్, కృష్ణుడు, రఘుబాబు, రాచ రవి, కనకవ్వ, వడ్లమాని శ్రీనివాస్, కావేరి, చమ్మక్ చంద్ర, చిత్రమ్ శీను, సంధ్యా గంధం, టి.సుగుణ, లక్ష్మణ్ మీసాల, ప్రభావతి, కంచెరపాలెం రాజు, ప్రభాస్ శ్రీను, సత్య ఏలేశ్వరం, అంజి బాబు, ఆర్ ఎస్ నంద, కిరీటి ఈ చిత్రంలో కీలక పత్రాలు నటిస్తున్నారు. ఈ చిత్రానికి చరణ్ అర్జున్ సంగీతం అందించారు. బొంతల నాగేశ్వర రెడ్డి ఎడిటర్, బాల్ రెడ్డి సినిమాటోగ్రాఫర్, కృష్ణ ఆర్ట్ డైరెక్టర్ గా ఉన్నారు.

Latest News
 
స్టార్‌ మాలో రేపటి సినిమాలు Sat, Sep 28, 2024, 06:40 PM
వెంకీ, బాలయ్యతో కలిసి పోజులిచ్చిన చిరు Sat, Sep 28, 2024, 06:37 PM
USAలో $3.7M మార్క్ ని చేరుకున్న 'దేవర' ప్రీమియర్ గ్రాస్ Sat, Sep 28, 2024, 06:33 PM
'గేమ్ ఛేంజర్' నుండి రా మచా మచా ప్రోమో అవుట్ Sat, Sep 28, 2024, 06:28 PM
IIFA ఉత్సవం 2024 : వెంకటేష్ నుండి ఉత్తమ దర్శకుడు అవార్డు అందుకున్న అనిల్ రావిపూడి Sat, Sep 28, 2024, 05:18 PM