తెలుగు రాష్ట్రాల్లో అర్ధరాత్రి ఒంటి గంటకు 500లకు పైగా షోలు

by సూర్య | Thu, Sep 26, 2024, 04:33 PM

 జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర సినిమా యావత్ ఇండియా వెయిట్ చేస్తోంది. ఇక సినిమా కూడా అంచనాలను మించి వసూళ్లు రాబడుతుందని సమాచారం.దేశవ్యాప్తంగా దేవర భారీ స్థాయిలో విడుదల కానుంది. తెలుగు రాష్ట్రాల్లో అర్ధరాత్రి ఒంటి గంటకు 500లకు పైగా షోలు పడనున్నాయి. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి సెన్సార్ యూఏ సర్టిఫికెట్ ఇచ్చింది. ప్రీ సేల్‌లో దేవర రూ. 75 కోట్లకు పైగా వసూలు చేసి రూ. 100 కోట్ల ఓపెనింగ్‌ను దాటుతుందని నివేదికలు సూచిస్తున్నాయి. దేవర సెప్టెంబర్ 27న విడుదల కానుంది అంటే ఇంకా కొన్ని గంటలు మాత్రమే ఉంది.అలాగే దేవర సినిమాకు 10 లక్షల టిక్కెట్లు అమ్ముడుపోయినట్లు సమాచారం. జూనియర్ ఎన్టీఆర్ దేవరలో జాన్వీ కపూర్ హీరోయిన్ పాత్రలో నటించగా సైఫ్ అలీ ఖాన్, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, షైన్ టామ్ చాకో, నరేన్, కలైయరసన్, అజయ్ మరియు అభిమన్యు సింగ్ కూడా కీలక పాత్రలలో నటించారు. రత్నవేలు సినిమాటోగ్రఫీ అందించగా సాబు సిరిల్ ప్రొడక్షన్ డిజైన్ చేశారు. ప్రస్తుత ట్రెండ్స్ చూస్తే దేవర అడ్వాన్స్ బుకింగ్స్ సూపర్ స్ట్రాంగ్ గా ఉన్నాయి. ఇప్పటికే హైదరాబాద్ సిటీ అడ్వాన్స్ సేల్స్ రూ. 15 కోట్ల దాటేయగా ఆంధ్ర లోనూ అదే స్థాయి అడ్వాన్స్ బుకింగ్స్ కనిపిస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల గ్రాస్ చూస్తే అటు ఇటుగా రూ. 35 కోట్లకు పైగా ఉంది. మరోపక్క బెంగళూరు బుకింగ్స్ ఊహించిన దాని కంటే ఎక్కువ రేంజ్ లో సాగుతున్నాయి. ప్రీమియర్స్ మౌత్ టాక్‌ అనుకూలంగా వస్తే ఈ నంబర్ మరింత పెరిగే అవకాశం ఉంది.

Latest News
 
'వెట్టయన్' తమిళనాడు థియేటర్ రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్ Fri, Sep 27, 2024, 07:46 PM
'స్వాగ్' నుండి స్వాగ్ వార్ వీడియో రిలీజ్ Fri, Sep 27, 2024, 07:40 PM
USAలో $3M మార్క్ ని చేరుకున్న 'దేవర' ప్రీమియర్ గ్రాస్ Fri, Sep 27, 2024, 07:36 PM
50 రోజుల రన్ ని పూర్తి చేసుకున్న 'కమిటీ కుర్రోళ్లు' టీమ్ Fri, Sep 27, 2024, 07:30 PM
'తాండల్' లో శివుని పాట Fri, Sep 27, 2024, 07:23 PM