'మెయ్యళగన్' కర్ణాటక రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్

by సూర్య | Wed, Sep 25, 2024, 01:14 PM

సి. ప్రేమ్ కుమార్‌ దర్శకత్వంలో కోలీవుడ్ నటుడు కార్తీ తన తదుపరి ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్‌కి దర్శకత్వం చేయడమే కాకుండా, ప్రేమ్ కుమార్ ఈ సినిమాకి కథ, స్క్రీన్‌ప్లే మరియు డైలాగ్‌లు రాశారు. ఈ చిత్రానికి మూవీ మేకర్స్ 'మెయ్యళగన్' అనే టైటిల్‌ ని లాక్ చేసారు. అరవింద్ స్వామి కూడా ఈ సినిమాలో ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క కర్ణాటక డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ని జయన్న ఫిలిమ్స్ సొంతం చేసుకున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు చిత్ర బృందం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. ఈ చిత్రంలో రాజ్‌కిరణ్, శ్రీ దివ్య, స్వాతి కొండే, దేవదర్శిని, జయప్రకాష్, శ్రీ రంజని, ఇళవరసు, కరుణాకరన్, శరణ్, రేచల్ రెబెక్కా, ఆంథోని, రాజ్‌కుమార్, ఇందుమతి, రాణి సంయుక్త, కాయల్ సుబ్రమణి, అశోక్ పాండియన్, తదితరులు కీలక పాత్రలలో నటించారు. గోవింద్ వసంత ఈ సినిమాకి స్వరాలు సమకూరుస్తున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్ 27న విడుదల కానుంది. 2డి ఎంటర్‌టైన్‌మెంట్‌పై జ్యోతిక మరియు సూర్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు, రాజశేఖర్ కర్పూరసుందరపాండియన్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

Latest News
 
గేమ్ ఛేంజర్ : ఈ తేదీన విడుదల కానున్న 'రా మచా మచా' సాంగ్ ప్రోమో Wed, Sep 25, 2024, 05:07 PM
ఆదిత్య మ్యూజిక్ లో అందుబాటులోకి వచ్చిన 'మ్యాడ్ స్క్వేర్' ఫస్ట్ సింగల్ Wed, Sep 25, 2024, 05:02 PM
ధృవ్ విక్రమ్‌తో అజయ్ భూపతి తదుపరి చిత్రం Wed, Sep 25, 2024, 04:42 PM
'స్వాగ్' UK రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్ Wed, Sep 25, 2024, 04:37 PM
ఫుకెట్‌లో శ్రియా శరణ్ పోజులు Wed, Sep 25, 2024, 04:32 PM