'స్వాగ్' అల్ ఇండియా థియేటర్ రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్

by సూర్య | Mon, Jun 24, 2024, 03:28 PM

టాలీవుడ్ నటుడు శ్రీవిష్ణుతన తదుపరి ప్రాజెక్ట్ ని హసిత్ గోలితో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ కామెడీ ఫాంటసీ డ్రామాకి 'స్వాగ్' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా అల్ ఇండియా థియేటర్ రైట్స్ ని ఆసియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్ LLP సొంతం చేసుకున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసారు. ఈ సినిమాలో రీతూ వర్మ కథానాయికగా నటిస్తుంది. ఈ సినిమాలో మీరా జాస్మిన్, శరణ్య, దక్ష నాగర్కర్, సునీల్, రవి బాబు, శ్రీను, గోపరాజు రమణ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో శ్రీవిష్ణు నాలుగు విభిన్నమైన అవతారాలలో కనిపించనున్నట్లు లేటెస్ట్ బజ్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాని నిర్మిస్తుంది.

Latest News
 
దేశానికి తొలి ‘మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్’ కిరీటం Sun, Oct 27, 2024, 03:13 PM
AV చూసి ఎమోషనల్ అయిన హీరో శివ కార్తికేయన్ Sun, Oct 27, 2024, 12:55 PM
రాయల్ లుక్ లో రాధికా పండిట్ ! Sun, Oct 27, 2024, 12:09 PM
నాకంటే పెద్దవారితో స్క్రీన్‌ షేర్‌ చేసుకోవడానికి నాకు ఎలాంటి ఇబ్బందీ లేదు: ఊర్వశీ రౌతేలా Sat, Oct 26, 2024, 08:58 PM
'బగీరా' టీమ్ తో సుమ స్పెషల్ ఇంటర్వ్యూ Sat, Oct 26, 2024, 08:52 PM