'ధూమ్ ధామ్' సెకండ్ సింగల్ విడుదలకి టైమ్ ఖరారు

by సూర్య | Wed, Jun 19, 2024, 05:34 PM

యువ నటుడు చేతన్ కృష్ణ 'ధూమ్ ధామ్' అనే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్నాడు. సాయి కిషోర్ మచ్చా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం లో హెబ్బా పటేల్ కథానాయికగా నటిస్తుంది. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమాలోని సెకండ్ సింగల్ ని మాయసుందరి అనే టైటిల్ తో రేపు ఉదయం 11:52 గంటలకి విడుదల చేయనున్నట్లు సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించారు. ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో సాయి కుమార్, వెన్నెల కిషోర్, పృథ్వీరాజ్, గోపరాజు రమణ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఫ్రైడే ఫ్రేమ్ వర్క్స్ బ్యానర్‌పై ఎంఎస్ రామ్ కుమార్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి గోపీ మోహన్ ఆకట్టుకునే కథ మరియు స్క్రీన్ ప్లే అందించారు. గోపీ సుందర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

Latest News
 
దేశానికి తొలి ‘మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్’ కిరీటం Sun, Oct 27, 2024, 03:13 PM
AV చూసి ఎమోషనల్ అయిన హీరో శివ కార్తికేయన్ Sun, Oct 27, 2024, 12:55 PM
రాయల్ లుక్ లో రాధికా పండిట్ ! Sun, Oct 27, 2024, 12:09 PM
నాకంటే పెద్దవారితో స్క్రీన్‌ షేర్‌ చేసుకోవడానికి నాకు ఎలాంటి ఇబ్బందీ లేదు: ఊర్వశీ రౌతేలా Sat, Oct 26, 2024, 08:58 PM
'బగీరా' టీమ్ తో సుమ స్పెషల్ ఇంటర్వ్యూ Sat, Oct 26, 2024, 08:52 PM