by సూర్య | Wed, Jun 19, 2024, 04:33 PM
తెలుగు నటుడు సందీప్ కిషన్ తన తదుపరి ప్రాజెక్ట్ ని త్రినాధ రావు నక్కిన దర్శకత్వంలో చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి SK30 అనే టైటిల్ ని పెట్టారు. ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా షూటింగ్ ని ప్రారంభించినట్లు చిత్ర బృందం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించింది. రావు రమేష్ ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్కి కథ, స్క్రీన్ప్లే మరియు సంభాషణలకు ప్రముఖ రచయిత ప్రసన్న కుమార్ బాధ్యత వహిస్తున్నారు. హాస్య మూవీస్, ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. పూర్తిస్థాయి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని రాజేష్ దండా నిర్మిస్తుండగా, బాలాజీ గుత్తా సహ నిర్మాతగా వ్యవహరించనున్నారు.
Latest News