by సూర్య | Tue, Apr 23, 2024, 03:16 PM
కేరళలోని తిరువనంతపురం లోక్సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి శశి థరూర్ మళ్లీ గెలవబోతున్నారని కన్నడ నటుడు ప్రకాశ్ రాజ్ కీలక వ్యాఖ్యలు చేశారు. శశి థరూర్ మరోసారి గెలిచి.. లోక్సభకు వెళ్తారని పేర్కొన్నారు. శశి థరూర్కు అండగా నిలబడడానికే తిరువనంతపురం వచ్చాను అని ప్రకాశ్ రాజ్ స్పష్టం చేశారు. ఆయన తనకు స్నేహితుడు అని, గత దశాబ్ద కాలం నుంచి ఆయన నుంచి ఎంతో నేర్చుకున్నానని తెలిపారు.
Latest News