భీమా : గల్లీసౌందుల్లో లిరికల్ సాంగ్ విడుదలకి టైమ్ లాక్

by సూర్య | Tue, Feb 20, 2024, 05:56 PM

కన్నడ దర్శకుడు హర్ష దర్శకత్వంలో టాలీవుడ్ మాకో స్టార్ గోపీచంద్ తన తదుపరి సినిమాని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి 'భీమా' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. ఈ సినిమా నుండి గల్లీసౌందుల్లో లిరికల్ సాంగ్ ని ఫిబ్రవరి 21, 2024న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. తాజాగా చిత్ర బృందం ఈ సాంగ్ ప్రోమోని రిలీజ్ చేసి పూర్తి లిరికల్ వీడియోని రేపు సాయంత్రం 5:04 గంటలకి విడుదల చేస్తున్నట్లు సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించారు.


ఈ చిత్రం మార్చి 8, 2024న మహా శివరాత్రికి విడుదల కానుంది. ఈ భారీ బడ్జెట్ యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో గోపీచంద్ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు. ఈ చిత్రంలో యువ తమిళ నటి ప్రియా భవానీ శంకర్ కథానాయికగా నటిస్తుంది. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కెకె రాధామోహన్ ఈ మాస్ ఎంటర్‌టైనర్‌ను నిర్మించారు. ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు.

Latest News
 
పహల్గామ్‌ ఉగ్రవాద దాడి పై పవన్ కళ్యాణ్ ట్వీట్ Wed, Apr 23, 2025, 08:08 AM
'చౌర్య పాఠం' సెన్సార్ పూర్తి Wed, Apr 23, 2025, 07:59 AM
'OG' విడుదల అప్పుడేనా? Wed, Apr 23, 2025, 07:55 AM
సెన్సార్ పూర్తి చేసుకున్న 'సారంగపాణి జాతకం' Wed, Apr 23, 2025, 07:50 AM
అన్ని భాషలలో విడుదలైన 'హిట్ 3' సెకండ్ సింగల్ Wed, Apr 23, 2025, 07:44 AM