by సూర్య | Thu, Nov 24, 2022, 03:04 PM
టీజర్, పోస్టర్స్ తో ప్రేక్షకుల అటెన్షన్ గ్రాస్ప్ చేసిన గీతసాక్షిగా చిత్రం పట్ల పాజిటివ్ వైబ్స్ వినిపిస్తున్నాయి. వాస్తవ సంఘటనల ఆధారంగా ఆంథోనీ మట్టిపల్లి డైరెక్షన్లో రూపొందుతున్న ఈ సినిమాలో ఆదర్శ్, చైత్రశుక్ల జంటగా నటించారు. గోపిసుందర్ సంగీతం అందిస్తున్నారు. రూపేష్ శెట్టి, శ్రీకాంత్ అయ్యంగార్, భరణి శంకర్, జయలలిత తదితరులు ఈ సినిమాలో కీలకపాత్రలు పోషిస్తున్నారు
తాజా సమాచారం ప్రకారం, షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం లేటెస్ట్ గా పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా పూర్తి చేసుకుని విడుదలకు కొంతదూరంలో ఉన్నట్టు తెలుస్తుంది. త్వరలోనే గీతసాక్షిగా విడుదలకు సంబంధించి అఫీషియల్ ఎనౌన్స్మెంట్ చేస్తామంటూ మేకర్స్ తెలిపారు.
Latest News