by సూర్య | Thu, Mar 25, 2021, 11:37 AM
ప్రజాస్వామ్యం నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమా 'రిపబ్లిక్'. మెగా హీరో సాయి ధరమ్ తేజ్ హీరో గా నటిస్తున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ను హీరో రామ్ చరణ్ విడుదల చేశాడు. 'రిపబ్లిక్' పోస్టర్ సినిమాపై ఆసక్తిని అమాంతం పెంచేసేలా ఉందని చెప్పారు. 'ప్రభుత్వం ఉందనే భ్రమల్లో మనం బతుకుతున్నాం. ప్రభుత్వం అంటే ఏమిటో మనం ఇంకా కనుక్కోవాల్సి ఉంది' అని పోస్టర్ పై రాసి ఉంది. ఈ చిత్రం దేవా కట్టా దర్శకత్వంలో తెరకెక్కుతోంది. సీనియర్ నటి రమ్యకృష్ణ ఈ సినిమాలో కీలక పాత్రను పోషిస్తున్నారు. మరోవైపు ఈ పోస్టర్ పై రామ్ చరణ్ ప్రశంసలు కురిపించాడు. పోస్టర్ ఎంతో ఆకట్టుకుందని చెప్పాడు. సాయి ధరమ్ తేజ్, దేవా కట్ట, యూనిట్ సభ్యులందరికీ చరణ్ ఆల్ ది బెస్ట్ అని చెప్పాడు. పోస్టర్ ను విడుదల చేసిన రామ్ చరణ్ కు సాయి ధరమ్ తేజ్ ధన్యవాదాలు తెలిపాడు.
Latest News