by సూర్య | Sat, Aug 06, 2022, 12:31 PM
3 నుంచి 10వ తరగతి వరకు ఉండే హైస్కూళ్లలో సబ్జెక్టు టీచర్ల నియామకం కోసం 8 వేలకుపైగా పోస్టులను అప్గ్రేడ్ చేసి ఎస్జీటీలకు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పించనుంది ప్రభుత్వం. 3వ తరగతి నుంచి 7 లేదా 8వ తరగతి వరకు ఉండే ప్రీహైస్కూళ్లలో విద్యార్థులు నిర్ణీత సంఖ్యకు మించి ఉంటే వాటిలోనూ సబ్జెక్టు టీచర్లుగా స్కూల్ అసిస్టెంట్లను నియమిస్తారు.
ప్రీ హైస్కూళ్లు, హైస్కూళ్లలో హెడ్మాస్టర్ల నియామకం కోసం 1,000 వరకు ఎస్ఏ పోస్టులను గ్రేడ్–2 హెచ్ఎం పోస్టులుగా అప్గ్రేడ్ చేస్తున్నారు. సీనియార్టీ ప్రాతిపదికన ఎస్ఏలకు వీటిలో పదోన్నతి కల్పిస్తారు. ఈమేరకు పదోన్నతుల విధివిధానాలను పాఠశాల విద్యాశాఖ జాయింట్ డైరక్టర్ మువ్వా రామలింగం శుక్రవారం సర్క్యులర్ రూపంలో విడుదల చేశారు.
Latest News