ఆ కారణంతో...పేటీఎం సేవలకు అంతరాయం

by సూర్య | Fri, Aug 05, 2022, 10:25 PM

ఆన్ లైన్ చెల్లింపులు నేడు ఎంతో కీలకంగా మారాయి. ఆ సేవలలో కాస్త అంతరాయం ఏర్పడ్డా వినియోగదార్లు ఎంతో అసౌకర్యానికి గురవుతున్నారు. తాజాగా ఆన్‌లైన్ పేమెంట్స్‌లో దిగ్గజ సంస్థ‌గా ఎదిగిన పేటీఎం శుక్రవారం వినియోగ‌దారుల‌కు చుక్క‌లు చూపించింది. నేటి ఉద‌యం 9 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం 12 గంట‌ల దాకా పేటీఎం సేవ‌లు స్తంభించాయి. దీంతో పేటీఎం వినియోగ‌దారులు తీవ్ర అసౌక‌ర్యానికి గుర‌య్యారు. ఈ అసౌక‌ర్యంపై వినియోగ‌దారుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్త‌డంతో పేటీఎం సంస్థ ఆ త‌ర్వాత స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించింది. 


శుక్ర‌వారం ఉద‌యం పేటీఎం ద్వారా చెల్లింపులు చేసేందుకు వినియోగ‌దారులు యాప్‌ను ఓపెన్ చేయ‌గా... సాంకేతిక స‌మ‌స్య‌లు క‌నిపించాయి. పేటీఎం ఓపెన్ అయినా... చెల్లింపులు కాలేదు. చెల్లింపుల‌కు అనుమ‌తి ఇచ్చిన వెంట‌నే పేటీఎం దానిక‌దే లాగౌట్ అయ్యింది. ఆ త‌ర్వాత తిరిగి లాగిన్ అవుదామ‌ని య‌త్నించిన వినియోగ‌దారుల‌కు నిరాశే ఎదురైంది.


దీంతో వినియోగ‌దారులు పెద్ద ఎత్తున పేటీఎంకు ఫిర్యాదులు చేశారు. దీంతో అప్ప‌టిక‌ప్పుడు రంగంలోకి దిగిన పేటీఎం బృందం త‌లెత్తిన సాంకేతిక స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించింది. ఆ త‌ర్వాత సాంకేతిక స‌మ‌స్య కార‌ణంగానే అవాంత‌రం త‌లెత్తింద‌ని, స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించిన‌ట్లు వినియోగ‌దారుల‌కు తెలిపింది.

Latest News

 
మరో వారం రోజుల్లో పోలింగ్.. వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు Mon, May 06, 2024, 09:47 PM
హీరో సాయి ధరమ్‌తేజ్ ప్రచారంలో ఉద్రిక్తత.. కాన్వాయ్‌పైకి రాయి, ఒకరికి తీవ్ర గాయాలు Mon, May 06, 2024, 09:02 PM
నగరిలో టీడీపీకి జైకొట్టిన వైసీపీ కీలక నేతలు.. మంత్రి రోజాపై ఆగ్రహం Mon, May 06, 2024, 08:58 PM
ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్నికల సంఘం శుభవార్త.. ఇక నో టెన్షన్ Mon, May 06, 2024, 08:54 PM
ఇదంతా ఆ ముగ్గురి కుట్ర, నాలుగేళ్లగా జరుగుతోంది.. అల్లుడు గౌతమ్ వ్యాఖ్యలపై మంత్రి రాంబాబు స్పందన Mon, May 06, 2024, 08:00 PM