by సూర్య | Wed, Jun 22, 2022, 10:42 PM
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సినిమా టిక్కెట్లపై కీలక నిర్ణయం తీసుకుంది. సినిమా టిక్కెట్లు ఇప్పుడు ప్రభుత్వం నిర్దేశించిన ధరలకు ఆన్లైన్లో అందుబాటులో లభించనున్నాయి. ఈ నిర్ణయంతో ప్రేక్షకులు ఇప్పుడు ఆన్లైన్లో తక్కువ ధరలకు సినిమా టిక్కెట్లను పొందగలుగుతారు. యువర్ స్క్రీన్స్ పోర్టల్ ద్వారా సినిమా టిక్కెట్లను బుక్ చేసుకోవడం వల్ల అదనపు ఛార్జీల భారం పడదని వెల్లడించారు.యువర్ స్క్రీన్స్ పోర్టల్ను ఉపయోగించడం వల్ల బ్లాక్ టికెటింగ్ను అరికట్టవచ్చని ఏపీఎఫ్ డీసీ ఎండీ విజయ్ కుమార్ తెలిపారు.
Latest News