మీ పిల్లలు ఆన్ లైన్ గేమ్స్ ఆడుతున్నారా...ఓ కన్నేయండి..అతడి ప్రవర్తనను పసిగట్టండి

by సూర్య | Wed, Jun 22, 2022, 02:33 PM

ఆన్ లైన్ గేమ్స్ లో పిల్లలు పావులవుతున్నారు. వారి సహాయంతో హ్యాకర్లు  కూడా రెచ్చిపోతున్న ఘటనలు  కనిపిస్తున్నాయి.  ఆన్‌లైన్ గేమింగ్‌కి అడిక్ట్ అయినా ఓ బాలుడు సైబర్ హ్యాకర్ వలలో పడ్డాడు. తల్లిదండ్రులను చంపేస్తానని బెదిరించి.. ఆ బాలుడి దగ్గర నుంచి వాళ్ల వివరాలను, ఫోన్ నెంబర్లను తీసుకున్నాడు. ఆ అబ్బాయి అలా హ్యాకర్ చెప్పిందల్లా చేశాడు. అలా పిల్లవాడి సహకారంతో హ్యాకర్ వారి ఇంట్లో వాళ్ల ఫోన్లను హ్యాక్ చేశాడు. వారికి అసభ్యకరమైన ఫోటోలను పంపించాడు. ఈ ఘటన రాజస్థాన్‌లోని జైపూర్‌లో చోటుచేసుకుంది.


జైపూర్‌లో 8వ తరగతి చదువుతున్న 13 ఏళ్ల విద్యార్థి ఆన్‌లైన్‌లో గేమ్స్ ఆడుతున్న క్రమంలో తనకు కొందరు పరిచయం అయ్యారు. అందులో ఓ హ్యాకర్ బాలుడికి ఓ లింక్ పంపించి కుటుంబ సభ్యుల వివరాలు, ఫోన్ నెంబర్లు పంపాలని కోరాడు. ఆ పిల్లవాడు సమాచారం మొత్తం ఇచ్చేశాడు. ఆఖరికి ఓటీపీలను కూడా షేర్ చేశాడు. తర్వాత వారి మొబైల్ ఫోన్లలో హ్యాకింగ్ యాప్‌ను కూడా ఇన్‌స్టాల్ చేసేశాడు. ఫోన్‌లో వింత యానిమేషన్లు రావడం మొదలయ్యాయి. దాంతో ఆ హ్యాకర్ వారి ఫోన్లను హ్యాక్ చేసి.. అందులో డేటాను మొత్తం తొలంగించేశాడు. వారి సోషల్ మీడియా ఖాతాల్లో అసభ్యకరమైన ఫోటోలను షేర్ చేశాడు. అంతేకాదు ఆ బాలుడితో ఇంటి గోడలు, టేబుళ్ల కింద చిన్నచిన్న డివైస్‌ చిప్స్‌ అమర్చేలా చేశాడు.


దీంతో ఇంట్లోవాళ్లకి అనుమానం వచ్చి.. సైబర్ పోలీసులను ఆశ్రయించారు. పిల్లవాడి ప్రవర్తన గురించి పోలీసులకు చెప్పారు. 24 గంటలు ఆన్‌లైన్ గేమ్ ఆడుతున్నాడని తెలియజేశారు. దాంతో పోలీసులు చిన్నారిని ప్రశ్నించి.. అన్ని విషయాలు తెలుసుకున్నారు. జైపూర్‌లో ఇలాంటి ఘటన జరగడం ఇదే తొలిసారని దర్యాప్తు కొనసాగుతుందని జైపూర్ కమిషనరేట్ సైబర్ నిపుణులు ముఖేశ్ చౌదరి చెప్పారు. అయితే ఆ హ్యాకర్ ఎటువంటి సైబర్ మోసానికి పాల్పడలేదు. కేవలం అసభ్యకరమైన ఫోటోలను మాత్రం అప్‌లోడ్ చేశాడు.

Latest News

 
హింసాత్మక ఘటనలపై సమాచారాన్ని సేకరించిన సిట్ అధికారులు Sun, May 19, 2024, 10:05 PM
ఎయిడ్స్‌ వ్యాధిపై అవగాహనా కలిగివుండాలి Sun, May 19, 2024, 10:04 PM
ఘనంగా మారమ్మ జాతర Sun, May 19, 2024, 10:03 PM
ఉద్యోగుల జీవితాలతో ప్రభుత్వం ఆడుకుంది Sun, May 19, 2024, 10:02 PM
విధులకు ఆటంకం కలిగించారంటూ ఎమ్మెల్యే పై కేసు నమోదు Sun, May 19, 2024, 10:00 PM