కరోనా నుంచి కోలుకున్న టీమిండియా క్రికెటర్
by సూర్య |
Wed, Jun 22, 2022, 07:46 AM
భారత స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కరోనా నుంచి కోలుకున్నాడు. జూన్ 16న ఇంగ్లాండ్తో టెస్టు ఆడేందుకు భారత జట్టు పయనమైంది. ఆ సమయంలో నిర్వహించిన కోవిడ్ నిర్ధారణ పరీక్షల్లో అశ్విన్కు పాజిటివ్ వచ్చింది. కోలుకున్న ఆయనకు మంగళవారం పరీక్షల్లో నెగటివ్ అని తేలింది. దీంతో త్వరలోనే ఇంగ్లాండ్కు అశ్విన్ పయనం కానున్నాడు. మరోసారి ఆర్టీపీసీఆర్ పరీక్షల్లో నెగటివ్ వస్తే, వెంటనే ఇంగ్లాండ్ వెళ్లే విమానం అశ్విన్ ఎక్కనున్నాడు.
Latest News