కొత్త టిప్స్ తో ఉబెర్...అటు క్యాబ్ డ్రైవర్లకు...ఇటు ప్రయాణికులకు సౌలభ్యం

by సూర్య | Sun, May 22, 2022, 12:30 PM

ఉబెర్ సంస్థ ప్రయాణికులను ఆకట్టుకొనేందుకు పలు  చర్యలను తీసుకొంది. ఇప్పటి వరకు ప్రయాణికులు ఉన్న చోటకు వచ్చి ట్రిప్ ప్రారంభిస్తేనే తీసుకెళ్లాల్సిన గమ్యస్థానం (డెస్టినేషన్) తెలిసేది. కానీ, ఇకపై ట్రిప్ ప్రారంభంలోనే డ్రైవర్లకు డెస్టినేషన్ కూడా తెలిసేలా ఊబర్ చర్యలు తీసుకుంది. దీంతో తమకు సమ్మతమైతే వారు దాన్ని స్వీకరించొచ్చు. లేదంటే ఆ ట్రిప్ ను వారు ముందే క్యాన్సిల్ చేసుకోవచ్చు. దీనివల్ల వినియోగదారులకు ట్రిప్ క్యాన్సిల్ చార్జీలు పడకుండా ఉంటాయి. ఇప్పటి వరకు ఈ ఏర్పాటు లేకపోవడంతో క్యాబ్ డ్రైవర్లు ఫోన్ చేసి డెస్టినేషన్ కనుక్కున్న తర్వాత రద్దు చేస్తున్నారు. దీంతో ట్రిప్ రద్దు చార్జీలు యూజర్లపై పడుతున్నాయి. దీనికి పరిష్కారమే కొత్త విధానం. 


ఇక నగదు రూపంలో ఇస్తేనే వస్తామనే వారు కొందరు. ఆన్ లైన్ పేమెంట్ అయితే ఊబర్ నుంచి తమకు రావడం ఆలస్యమవుతుందని డ్రైవర్లు చెబుతుంటారు. దీంతో ట్రిప్ తీసుకోవడానికి ముందే ఆ ట్రిప్ కు సంబంధించి ఏ రూపంలో చెల్లించేది ముందే తెలిసేలా ఊబర్ చర్యలు తీసుకుంది.


ఇదిలావేంటూ ఊబర్ క్యాబ్ బుక్ చేసుకుంటే.. కొద్ది సమయం వృథా అయిన తర్వాత డ్రైవర్లు ట్రిప్ రద్దు చేస్తే ప్రయాణికులకు ఎంతో కోపం వచ్చిన సందర్భాలున్నాయి. డ్రైవర్ల చర్యల కారణంగా ప్రయాణికులు రైళ్లు, బస్సు సర్వీసులను మిస్ అయిన సందర్భాలు బోలెడు. దీనిని గుర్తించచిన ఊబర్ పైన పేర్కన్న విధంగా పరిష్కార మార్గం తీసుకొచ్చింది. . సాధారణంగా యూజర్ల లొకేషన్ సమీపంలోని క్యాబ్ లను ఊబర్ సిస్టమ్ గుర్తించి, వారికి ట్రిప్ ను ఆఫర్ చేస్తుంది. సమీపంలో మూడు ట్యాక్సీలు అందుబాటులో ఉంటే ముగ్గురికీ ట్రిప్ సందేశం కనిపిస్తుంది. ఎవరు ఓకే చేస్తే వారికి అలాట్ అవుతుంది.

Latest News

 
ఊరవతల నగ్నంగా మహిళ మృతదేహం.. అసలేమైంది Sun, May 19, 2024, 07:44 PM
మెగా ఫ్యామిలీపై పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీత కీలక వ్యాఖ్యలు Sun, May 19, 2024, 07:42 PM
యువకులే టార్గెట్.. రూ.లక్షల్లో జీతాలంటూ వల.. ఆపై విదేశాలకు తీసుకెళ్లి దారుణాలు Sun, May 19, 2024, 07:32 PM
వేరుశనగ విత్తనాలకు దరఖాస్తులు చేసుకోండి Sun, May 19, 2024, 07:08 PM
సుందరయ్య చిత్రపటానికి నివాళులర్పించిన సిపిఎం నేతలు Sun, May 19, 2024, 07:05 PM