సరైన దౌత్యంతోనే యుద్ధం ముగుస్తుంది: జెలెన్ స్కీ

by సూర్య | Sat, May 21, 2022, 09:14 PM

ఈ యుద్ధంలో తాము విజయం సాధిస్తామని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ చెప్పారు. సరైన దౌత్యంతోనే యుద్ధం ముగుస్తుందని అన్నారు. యుద్ధంలో రక్తపాతం తప్పదని అన్నారు. యుద్ధం కొనసాగుతుందని... చివరకు దౌత్య మార్గాల ద్వారానే యుద్ధం అంతమవుతుందని చెప్పారు. అయితే రెండు దేశాలు పట్టు వీడకపోవడం వల్ల.. ఇది అంత సులువుగా సాధ్యమయ్యే పని కాదని అన్నారు.


ఇదిలావుంటే ఉక్రెయిన్, రష్యాల మధ్య భీకర యుద్ధం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. రష్యా భారీ స్థాయిలో విరుచుకుపడుతున్నప్పటికీ ఉక్రెయిన్ దీటుగా ఎదుర్కొంటోంది. రష్యా బలగాలకు విపరీతమైన నష్టాన్ని కలిగిస్తోంది. మరోవైపు రష్యా చేస్తున్న దాడులతో ఉక్రెయిన్ నగరాలు ధ్వంసమవుతున్నాయి. యుద్ధం ప్రారంభమయి చాలా రోజులు గడుస్తున్నప్పటికీ ఎవరూ ఎవరిపై పైచేయి సాధించలేక పోయారు. యుద్ధం ఇంకెన్ని రోజులు కొనసాగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. 

Latest News

 
భూ పట్టా చట్టంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు : సజ్జల Sat, May 04, 2024, 11:24 PM
ఏపీ రెయిన్ అలెర్ట్ Sat, May 04, 2024, 10:07 PM
ఈసారి ఎన్నికల్లో కూటమిని గెలిపించి మీ భవిష్యత్తును కాపాడుకోండి : పవన్ కళ్యాణ్ Sat, May 04, 2024, 09:26 PM
కొడుకు నామినేషన్‌లో బ్రిజ్ భూషణ్ హంగామా,,,,వేలాది అనుచరులు.. 700 కార్లు.. గాల్లోకి కాల్పులు Sat, May 04, 2024, 09:15 PM
సింహాచలం వెళ్లలేకపోతున్న భక్తులకు గుడ్‌న్యూస్.. చందనం, ప్రసాదం పోస్టల్‌లో పొందండిలా Sat, May 04, 2024, 08:56 PM