చివరకు నిజమే గెలుస్తుంది: తేజస్వి యాదవ్

by సూర్య | Sat, May 21, 2022, 09:12 PM

సీబీఐ సోదాలపై  లాలు ప్రసాద్ యాదవ్ తనయుడు తేజస్వి యాదవ్ స్పందిస్తూ కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వంపై తీవ్రంగా యాదవ్ మండిపడ్డారు. ఇలాంటి ప్రభుత్వాలకు లాలూ భయపడరని, వెన్ను చూపరని అన్నారు. సత్య మార్గంలో పయనించడం చాలా కష్టమని... అయినా అసాధ్యం కాదని చెప్పారు. కాస్త ఆలస్యం అయినా చివరకు నిజమే గెలుస్తుందని అన్నారు. ఈ పోరాటంలో తాము విజయం సాధిస్తామని చెప్పారు.


బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన కుటుంబ సభ్యులపై సీబీఐ తాజాగా మరో కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఆయన రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో ఉద్యోగాలను ఇప్పించి వారి నుంచి భూములు, ఆస్తుల రూపంలో లంచాలు తీసుకున్నారని సీబీఐ అభియోగాలను మోపింది. ఈ క్రమంలో నిన్న లాలూకి చెందిన పలు చోట్ల సీబీఐ సోదాలను నిర్వహించింది. 

Latest News

 
భూ పట్టా చట్టంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు : సజ్జల Sat, May 04, 2024, 11:24 PM
ఏపీ రెయిన్ అలెర్ట్ Sat, May 04, 2024, 10:07 PM
ఈసారి ఎన్నికల్లో కూటమిని గెలిపించి మీ భవిష్యత్తును కాపాడుకోండి : పవన్ కళ్యాణ్ Sat, May 04, 2024, 09:26 PM
కొడుకు నామినేషన్‌లో బ్రిజ్ భూషణ్ హంగామా,,,,వేలాది అనుచరులు.. 700 కార్లు.. గాల్లోకి కాల్పులు Sat, May 04, 2024, 09:15 PM
సింహాచలం వెళ్లలేకపోతున్న భక్తులకు గుడ్‌న్యూస్.. చందనం, ప్రసాదం పోస్టల్‌లో పొందండిలా Sat, May 04, 2024, 08:56 PM