by సూర్య | Sat, May 21, 2022, 03:17 PM
శ్రీలంకలో రోజులు గడుతున్న పరిస్థితి దిగజారుతుందే తప్పా పరిస్థితులు మాత్రం అదుపులోకి రావడంలేదు. దీంతో ఆ దేశంలోని నెలకొన్న కొన్ని ఘటనలు ఆ దేశ దీనావస్థను ఎత్తిచూపుతున్నాయి. ఆ దేశంలో ఇంధన కొరత తీవ్రంగా వేధిస్తోంది. పెట్రోల్, డీజిల్ కోసం డబ్బాలతో బంకుల వద్ద ప్రజలు రోజులకొద్దీ పడిగాపులు కాసే పరిస్థితి కొనసాగుతోంది. ఇంధన కొరత తీవ్రమైన నేపథ్యంలో శ్రీలంక ప్రభుత్వం చర్యలు చేపట్టింది. తాజాగా పాఠశాలలను మూసివేస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా అత్యవసర సేవలు మినహా ప్రభుత్వ ఉద్యోగులు కార్యాలయాలకు రావద్దని సూచించారు.
Latest News