by సూర్య | Sat, May 21, 2022, 01:28 PM
ఎంఎల్ఏ కాపు రామచంద్రారెడ్డి సవాల్ ను స్వీకరించి రాయదుర్గం శ్రీ ప్రసన్న వెంకటరమణ స్వామి ఆలయానికి అనంతపురం నుంచి బయలుదేరిన మాజీమంత్రి, టిడిపి నేత కాలవశ్రీనివాసులు ను వడ్డుపల్లి వద్ద పోలీసులు అడ్డుకున్నారు. అరెస్టు చేశారు. బ్రహ్మోత్సవాల్లో స్వామి వారి కల్యాణం వైవి సుబ్బారెడ్డి కోసం 3 గంటలు ఆలస్యం చేసి అపచారం చేశారని కాలవ ఆరోపించారు.
అన్నీ సక్రమంగా జరిగాయంటూనే గుడికివచ్చి అదే విషయాన్ని చెప్పాలని కాపు సవాల్ చేసిన నేపథ్యంలో కాలవ శ్రీనివాసులు శనివారం ఆలయానికి బయలు దేరాడు. ఈ నేపథ్యంలో కాలవశ్రీనివాసులు ను అడ్డుకున్న పోలీసులు అరెస్టు చేసి ఆత్మకూరు స్టేషన్ కు తరలించారు.
Latest News